ETV Bharat / state

'పుట్ట మధుపై దుష్ప్రచారం చేస్తున్నారు'

author img

By

Published : May 6, 2021, 3:17 PM IST

trs press meet, putta madhu, Manthani
trs press meet, putta madhu, Manthani

పెద్దపల్లి జిల్లా మంథనిలోని తెరాస కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. తెరాస బలోపేతానికి జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధు నిరంతరం కృషి చేస్తున్నారని.. అతనిపై ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయని కమాన్​పూర్​ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ ఆరోపించారు.

జడ్పీ చైర్మన్ పుట్ట మధు తెరాస బలోపేతానికి నిజాయతీగా కృషి చేస్తున్నారని కమాన్​పూర్​ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని తెరాస కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు.

సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. తమ నాయకుడు పుట్ట మధు తెరాసని వీడేదిలేదని సత్యనారాయణ స్పష్టం చేశారు. మంథని నియోజకవర్గ అభివృద్ధికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో పుట్ట మధుపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈటల రాజేందర్ వ్యక్తిగత అంశాన్ని ముడిపెట్టి మంథని తెరాసలో చీలికలు తేవాలని ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయని విమర్శించారు.

ఇదీ చూడండి: కుమారుడిని చంపి తండ్రి ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.