ETV Bharat / state

Water Levels in Telangana Projects Today : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు.. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నీరు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2023, 1:34 PM IST

Water Levels in SRSP Project Today
Water Levels in Telangana Projects Today

Water Levels in Telangana Projects Today : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం మొదలైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయం వద్ద.. 3 వరద గేట్ల ద్వారా 29,889 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 2,500 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

Water Levels in Telangana Projects Today రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నీరు

Water Levels in Telangana Projects Today : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్‌ సహా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వీటికి తోడు ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టుల్లో క్రమంగా నీటిమట్టాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు భారీ ప్రవాహం వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి.. దిగువన గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్​ఫ్లో భారీగా వస్తుండగా.. 4 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 89.7 టీఎంసీలతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. గేట్లు ఎత్తడంతో గోదావరి నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Heavy Rains in Telangana Today : ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన.. తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు

Nizamsagar Water Level Today : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకీ వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,500 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,403.7 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలకు గానూ.. ప్రస్తుత నీటి నిల్వ 16 టీఎంసీలుగా ఉంది.

Kadem Reservoir Water Level Today : నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి ఎగువన ఉన్న ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం జలాశయంలోకి 13,300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. 3 వరద గేట్ల ద్వారా 29,889 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కడెం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 696.52 అడుగులకు చేరింది.

Two Workers Stuck in Vaagu Viral Video : అకస్మాత్తుగా వరద.. వాగు మధ్యలో చిక్కుకున్న ఇద్దరు కూలీలు.. చివరకు..!

Heavy Rains in Nizamabad : ఇదిలా ఉండగా.. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న వర్షంతో.. జిల్లా కేంద్రమంతా జలమయమైంది. నగరంలోని రైల్వేస్టేషన్, బ​స్టాండ్, వీక్లీ మార్కెట్, బోధన్ రోడ్డులోని మాలపల్లి రహదారులు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పులాంగ్ వాగు వరద నీటితో పరుగులు పెడుతోంది.

వెంగల్‌పాడ్ వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దర్పల్లి-సిరికొండ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో భారీ వర్షం కురుస్తోంది. పాతికేళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. గాంధారి వాగుకు వరద పోటెత్తింది. వరద ప్రవాహానికి దిగువన ఉన్న వరి పొలాలు నీట మునిగాయి. వాగు సమీపంలో ఉన్న కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.

Rain Alerts in Telangana : రాగల 48 గంటల్లో అల్పపీడనం.. 3 రోజులు ఆరెంజ్​ హెచ్చరికలు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.