ETV Bharat / state

స్పాట్​ అడ్మిషన్​ జరపాలంటూ విద్యార్థుల ఆందోళన

author img

By

Published : Nov 16, 2019, 8:18 PM IST

స్పాట్​ అడ్మిషన్​ జరపాలంటూ విద్యార్థుల ఆందోళన

తెలంగాణ విశ్వవిద్యాలయంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైస్ ఛాన్సలర్ ఛాంబర్​ను ముట్టడించారు. వీసీ అనిల్ కుమార్​కు వినతి పత్రం సమర్పించారు.

నిజామాబాద్​ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల్లో 2019 -2020 విద్య సంవత్సరానికి పీజీ సీట్లు మిగిలిపోయాయి. వాటిని భర్తీ చేయడానికి వీసీ అనుమతినివ్వాలని గత 20 రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరంకాకుండా స్పాట్ అడ్మిషన్లు నిర్వహించి అవకాశం కల్పించాలని కోరుతూ విద్యార్థులు ర్యాలిగా వచ్చి వీసీ ఛాంబర్​లో బైఠాయించారు. ఉపకులపతి అనిల్ కుమార్​కు వినతి పత్రం అందించారు.

స్పాట్​ అడ్మిషన్​ జరపాలంటూ విద్యార్థుల ఆందోళన

ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్ అరెస్ట్

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.