ETV Bharat / state

పొంగి పొర్లుతున్న వాగులు.. మత్తడి పోస్తున్న చెరువులు..

author img

By

Published : Aug 28, 2020, 10:16 AM IST

Overflowing ditches and ponds in Nizamabad District
పొంగి పొర్లుతున్న వాగులు.. మత్తడి పోస్తున్న చెరువులు..

పొంగి పొర్లుతున్న వాగులు..మత్తడి పోస్తున్న చెరువులు...నీటితో పరవళ్లు తొక్కుతున్న ప్రాజెక్టులు..ఇటీవల కురిసిన ఏకధాటి వర్షాలు నిజామాబాద్ జిల్లాలోని చెరువులకు జలకళను తెచ్చిపెట్టాయి. భారీగా వరద రావడంతో చెరువులు నిండి నూతన శోభను సంతరించుకున్నాయి. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో జలకళ ఉట్టి పడుతోంది. 2016 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో భారీ వర్షాలు కురవడంతో చెరువులన్నీ నీళ్లతో కళకళలాడుతున్నాయి. దీంతో వచ్చే యాసంగి, వానాకాలం పంటలకు ఢోకా ఉండదని రైతులు సంబుర పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువుల కింద రెండు లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. చెరువులు పూర్తిగా నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పొంగి పొర్లుతున్న వాగులు.. మత్తడి పోస్తున్న చెరువులు..

నిజామాబాద్‌ జిల్లాలోని చెరువులకు జలకళ వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు పల్లె ఆయకట్టుకు చేవ తెచ్చింది. ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులన్నీ మత్తడి దూకుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయి. రైతులు, మత్స్యకారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పంటలకు అవసరమైన సాగు నీటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు సాగుదారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 3206 చెరువులున్నాయి. ఈనెల 13 నుంచి 20వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జిల్లాలోని 866 చెరువులు నిండి అలుగు పారాయి. గతేడాది కేవలం 189చెరువులు మాత్రమే నిండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య గణనీయంగా పెరగడంతో రైతుల ఆనందానికి అవధులు లేవు.

ఈ ఏడాది వర్షాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులకు దాదాపుగా వరద నీరు వచ్చి చేరింది . దీంతో రెండు పంటల సాగుకు ఢోకాలేదంటున్నారు కర్షకులు. గత రెండు సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో భూగర్భజలాలు కూడా పెరిగాయి..దీంతో రైతులు ఖుషీఖుషీగా ఉన్నారు. గతంలో వర్షాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఇప్పుడు ప్రతి రైతుకు చేతినిండా పని ఉందని కర్షకులు అంటున్నారు. మత్స్యకారులకు కూడా మంచి ఉపాధి లభిస్తుందని అంటున్నారు.

చెరువుల్లోకి భారీగా నీరు చేరడం పట్ల స్థానికులు, రైతులు, మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే యాసంగి, వానాకాలం రెండు పంటలకు సాగునీటికి ఢోకా ఉండదని చెబుతున్నారు.

ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.