ETV Bharat / state

Mlc Kavitha: 'తెరాసతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి'

author img

By

Published : Jun 11, 2021, 5:39 PM IST

ఎమ్మెల్సీ కవిత.. నిజామాబాద్ నగరంలోని ఫులాంగ్ పార్క్​ని సందర్శించారు. పార్క్​లో జరుగుతోన్న సుందరీకరణ పనులను ఆమె పరిశీలించారు. పనుల నిర్వహణపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.

mlc kavitha
mlc kavitha

తెరాస ప్రభుత్వంలోనే పట్టణాల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఫులాంగ్ పార్క్​ని ఆమె సందర్శించారు. పార్క్​లో సుందరీకరణ పనుల నిర్వాహణపై మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.

సీఎం కేసీఆర్ చొరవతో నగరాల్లో.. రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు తదితర సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు కవిత. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వీ పటేల్​, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఎంపీకే టోకరా.. క్రెడిట్​ కార్డు ఫోర్జరీతో మోసం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.