నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మినార్పల్లి, భవానిపేట్ గ్రామాల్లో ఐజీ స్టీఫెన్ రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని స్థానికులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు.
గ్రామాల్లోని నర్సరీలు, వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పలు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: విపత్కర పరిస్థితుల్లో ఆత్మరక్షణతోనే దేశరక్షణ!