ETV Bharat / state

తొలి డబుల్ ​బెడ్​రూం ఇల్లు నరసింహ కుటుంబానికే: బండి

author img

By

Published : Feb 28, 2021, 10:00 PM IST

భాజపా అధికారంలోకి వచ్చాక తొలి డబుల్ ​బెడ్​రూం ఇల్లు.. నరసింహ కుటుంబానికే కేటాయిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ వెల్లడించారు. బాన్సువాడ సభలో బండి సంజయ్, ఎంపీ అర్వింద్ ప్రసంగాలకు​ బాలుడు నరసింహ స్పందించిన తీరు వైరల్​ అయిన నేపథ్యంలో.. భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బాలుడితో సంజయ్​ సెల్ఫీ దిగారు.

bandi sanjay
తొలి డబుల్ ​బెడ్​రూం ఇల్లు నరసింహ కుటుంబానికే : బండి

నిజామాబాద్​ జిల్లా బాన్సువాడ ఇటీవల నిర్వహించిన భాజపా బహిరంగ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్​ ప్రసంగాలకు బాలుడు నరసింహ స్పందించిన తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. ఈ నేపథ్యంలో ఇవాళ బాలుడు నర్సింహ.. భాజపా రాష్ట్ర కార్యాలయానికి రాగా బండి సంజయ్ సాదరంగా ఆహ్వానించారు. బాలుడిని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లారు సంజయ్​. నరసింహతో కలిసి భోజనం చేశారు. కొత్త బట్టలు పెట్టి.. బాలుడు నర్సింహతో సెల్ఫీ దిగారు.

bandi sanjay
నరసింహతో మాట్లాడుతున్న సంజయ్​

బాలుడు నరసింహ పేదరికాన్ని చూసి బండి భావోద్వేగానికి గురయ్యారు. అధికారంలోకి వచ్చాక తొలి రెండు పడక గదుల ఇల్లును నరసింహ కుటుంబానికే కేటాయిస్తామని సంజయ్​ వెల్లడించారు. బాన్సువాడలో నరసింహ కుటుంబం‌ ఉండే ఇంటి అద్దెను ఇకపై భాజపా చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. నరసింహ చదువు బాధ్యతలను ఎంపీ అర్వింద్​ చూస్తారన్నారు. సీఎం కేసీఆర్ పేదలను ఏవిధంగా మోసం చేస్తున్నారో నరసింహానే ఉదాహరణగా చెప్పవచ్చని బండి సంజయ్​ అన్నారు.

తొలి డబుల్ ​బెడ్​రూం ఇల్లు నరసింహ కుటుంబానికే : బండి
bandi sanjay
నరసింహతో కలిసి భోజనం చేస్తున్న బండి సంజయ్​

ఇవీచూడండి: 'ఫీజు వేధింపులు ఆపకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.