ETV Bharat / state

'దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందే కాంగ్రెస్‌'

author img

By

Published : Dec 28, 2020, 1:47 PM IST

నిజామాబాద్​లో కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు మోహన్​రెడ్డి పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు.

Congress Party Emergence Day Celebrations in Nizamabad
'దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందే కాంగ్రెస్‌'

దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందే కాంగ్రెస్‌ అని నిజామాబాద్​ జిల్లా పార్టీ అధ్యక్షులు మోహన్​రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

పార్టీ.. 137వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని మోహన్ పేర్కొన్నారు. సోనియాగాంధీ, రాహుల్​ల నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఇప్పటినుంచే కార్యాచరణను ప్రారంభిస్తామని వివరించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఇంఛార్జీ తాహెర్ బిన్, నగర అధ్యక్షులు వేణు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం రోజు తిరంగా యాత్రలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.