ETV Bharat / state

కాంగ్రెస్​ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి - రైతులు అరేబియా సముద్రంలోకి : సీఎం కేసీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 2:44 PM IST

Updated : Nov 15, 2023, 10:30 PM IST

BRS Praja Ashirvada Sabha
BRS Public Meeting at Bodhan

BRS Public Meeting at Bodhan : తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్​ పార్టీనే అని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ విమర్శించారు. వందల మందిని పొట్టన పెట్టుకుని కాంగ్రెస్​ తెలంగాణ ఇచ్చిందని మండిపడ్డారు. అందుకే ఈసారి ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటేయాలని సూచించారు. నిజామాబాద్​లోని బోధన్​ నియోజకవర్గంలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.

కాంగ్రెస్​ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి - రైతులు అరేబియా సముద్రంలోకి : సీఎం కేసీఆర్

BRS Public Meeting at Bodhan : కాంగ్రెస్​ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళ్లడం ఖాయమని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR)​ హితవు పలికారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజలు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని.. అభ్యర్థుల గుణగణాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. నిజామాబాద్​ జిల్లా బోధన్​​ నియోజకవర్గంలో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ(BRS Public Meeting)లో కేసీఆర్​ పాల్గొని.. ప్రసంగించారు.

తెలంగాణ ప్రజల కోసమే బీఆర్​ఎస్​ కృషి చేస్తోందని.. రాష్ట్రానికి ప్రధాన శత్రువు కాంగ్రెస్​నే అని అన్నారు. 1969లో 400 మంది ఉద్యమకారులను కాంగ్రెస్​ ప్రభుత్వం కాల్చి చంపిందని ఆవేదన చెందారు. వందల మందిని పొట్టన పెట్టుకుని హస్తం పార్టీ తెలంగాణ ఇచ్చిందని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో నిజాం సాగర్​ను కాంగ్రెస్​ ప్రభుత్వం ఎండగట్టలేదా అంటూ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే నిజాం సాగర్​కు ఏడాది మొత్తం నిండుగా ఉంచే బాధ్యత బీఆర్​ఎస్​ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు.

'ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు'

BRS Praja Ashirvada Sabha at Bodhan : 'వ్యవసాయ స్థిరీకరణ జరగాలని బీఆర్​ఎస్​ శ్రమించింది. వ్యవసాయ స్థిరీకరణ కోసం సాగునీటి పన్ను రద్దు చేశాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్​ ఇస్తున్నాము. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏనాడైనా రైతుబంధు గురించి ఆలోచన చేసిందా? ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి ఎలా వస్తాయి? కాంగ్రెస్​కు ఓటేస్తే దళారీ రాజ్యం మళ్లీ వస్తుంది. కాంగ్రెస్​ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళతారని' సీఎం కేసీఆర్​ ఎద్దేవా చేశారు.

Telangana Election 2023 : బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని సీఎం కేసీఆర్​ సూచించారు. రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్​ దుబారా అని రేవంత్​ రెడ్డి అంటున్నారు.. మరి కాంగ్రెస్​ గెలిస్తే రైతులకు 3 గంటల కరెంటుతో సరిపెడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితుబంధుకు జైభీమ్​ అంటారని వ్యంగ్యంగా విమర్శించారు. దుర్మార్గపు కాంగ్రెస్​ను రైతులు మట్టి కరిపించాలను ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్​కు ఓటేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని ఆరోపించారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్​లో సైతం 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్​ తెలిపారు.

ఉచిత కరెంట్​పై జానారెడ్డి మాట తప్పారు - హాలియా సభలో కేసీఆర్

మంది మాటలు విని ఓటేస్తే ఐదేళ్లు ఇబ్బంది పడతాం : కేసీఆర్

Last Updated :Nov 15, 2023, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.