ETV Bharat / state

కవితను ఓడించినందుకే ఎంపీ అర్వింద్‌పై దాడులు: భాజపా

author img

By

Published : Jul 13, 2020, 5:38 PM IST

bjp
bjp

భాజపా ఎంపీ అర్వింద్‌పై తెరాస దాడికి నిరసనగా నిజామాబాద్‌లో ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. దాడిని సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.

వరంగల్​లో ఎంపీ ధర్మపురి అర్వింద్​పై తెరాస శ్రేణుల దాడిని నిరసిస్తూ నిజామాబాద్​లో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. భాజపా జిల్లా కార్యాలయం నుంచి ప్రగతి నగర్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఎంపీ అర్వింద్‌పై తెరాస దాడిని సిగ్గుమాలిన చర్యని భాజపా కార్పొరేటర్‌ న్యాలం రాజు అన్నారు. కవితను ఓడించినందుకే దాడికి పాల్పడుతున్నరా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తుంటే... దాడులు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.