ETV Bharat / state

ధర్మారం: భోగిమంటతో వేడి నీటి స్నానం

author img

By

Published : Jan 13, 2021, 10:06 AM IST

bhogi celebrations at dharmaram
ధర్మారం: భోగిమంటతో వేడి నీటి స్నానం

నిజామాబాద్​ జిల్లా ధర్మారం బి గ్రామంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంటల్లోనే వేడి నీరుకాచుకొని తలస్నానం చేశారు. ఇలా చేస్తే ఏడాదంతా ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతున్నట్లు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం ధర్మారం బి గ్రామస్థులు సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే చిన్నా పెద్దా అంతా భోగి మంటలు వేశారు.

భోగిమంటతో నీరు వేడిచేసుకొని.. తలస్నానం చేస్తే సంవత్సరమంతా ఆరోగ్యవంతులుగా ఉంటారనే నమ్ముతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. అనంతరం డీజే పాటలకు నృత్యాలు చేస్తూ కుటుంబ సమేతంగా వేడుకలు నిర్వహించుకున్నారు.

ధర్మారం: భోగిమంటతో వేడి నీటి స్నానం

ఇవీచూడండి: భోగి సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.