కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు కిందటి సంవత్సరం కన్నా 30శాతం నిధులను తగ్గించారని... అంగన్వాడీ యూనియన్ నాయకురాలు రాజసులోచన అన్నారు. తగ్గింపును నిరసిస్తూ నిజామాబాద్లోని సీఐటీయూ కార్యాలయం వద్ద బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యారంగాన్ని ప్రైవేటీకరించిందని ఆమె ఆరోపించారు.
అందులో భాగంగానే ఐసీడీఎస్కు నిధులు తగ్గించిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఐసీడీఎస్కు నిధులను పెంచి బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: విద్యుత్ షాక్తో తల్లి... కాపాడబోయి కొడుకు...