ETV Bharat / state

ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకొని ఆచరించాలి: ప్రకాశ్​రాజ్

author img

By

Published : Oct 9, 2022, 11:02 PM IST

Prakash Raj On Natural Farming
Prakash Raj On Natural Farming

Prakash Raj On Natural Farming: ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకొని ఆచరించాలని సినీ నటుడు ప్రకాశ్​రాజ్ అన్నారు. రైతు వ్యాపారవేత్తగా మారి తాను పండించిన పంటను.. తానే అమ్ముకునే స్థాయికి ఎదిగినప్పుడే రైతు రాజు అవుతాడని చెప్పారు. నిజామాబాద్​ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రకాశ్​రాజ్ పాల్గొన్నారు.

Prakash Raj On Natural Farming: నిజామాబాద్ జిల్లాలో సినీ నటుడు ప్రకాశ్​రాజ్, నిర్మాత దిల్​రాజ్​ సందడి చేశారు. మోపాల్ మండలం నర్సింగ్​పల్లి గ్రామంలోని ఇందూరు తిరుమల దేవస్థానాన్ని వారు దర్శించుకున్నారు. అనంతరం మా పల్లె ట్రస్ట్ చేపట్టిన ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించే విధానాన్ని ప్రముఖ సేంద్రియ నిపుణులు విజయ్​రామ్​తో కలసి వీక్షించారు.

ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు వారు పండించే విధానాన్ని ప్రకాశ్​రాజ్ అడిగి తెలుసుకున్నారు. మా పల్లె ట్రస్ట్ వెబ్​సైట్​ను ప్రకాశ్​రాజ్ ప్రారంభించారు. రైతు వ్యాపారవేత్తగా మారి తాను పండించిన పంటను.. తానే అమ్ముకునే స్థాయికి ఎదిగినప్పుడే రైతు రాజు అవుతాడని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకొని ఆచరించాలని ప్రకాశ్​రాజ్ పేర్కొన్నారు.

మా పల్లె ట్రస్టులో ఆర్గానిక్ వ్యవసాయం చాలా బాగుందని ప్రకాశ్​రాజ్​ తెలిపారు. చాలా రకాల దేశీయ విత్తనాలను కాపాడుతున్నారని చెప్పారు. తద్వారా ప్రకృతి వ్యవసాయం వల్ల ముందు తరాలకు చాలావరకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రకాశ్​రాజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మా పల్లె ట్రస్ట్ వ్యవస్థాపకులు నరసింహారెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంపై మక్కువ పెంచుకొని ఆచరించాలి: ప్రకాశ్​రాజ్

"రైతుగా ఉంటే సరిపోదు. రైతు వ్యాపారి కావాలి. మాభూమి మామట్టి అని ఉండాలి. ఇలాంటివి మీరే చేసుకోవాలి. చాలా మంది రావాలి. ఈగ్రామం మోడల్​గా మారాలి. నావంతు అండగా ఉంటాను." - ప్రకాశ్​రాజ్ సినీ నటుడు

ఇవీ చదవండి: 'రోగి డిశ్చార్జ్​ అయ్యే సమయంలోనే అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వాలి'

'శరవేగంగా అయోధ్య రామమందిర నిర్మాణం.. 40 శాతం పనులు పూర్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.