ETV Bharat / state

అమ్మా నాన్నా ఐయామ్ సారీ.. అన్నా.. నేను చనిపోతున్నా.. నువ్వు అమెరికా నుంచి వచ్చేయ్

author img

By

Published : Mar 31, 2023, 10:16 AM IST

Updated : Mar 31, 2023, 12:36 PM IST

Medical Student Suicide
Medical Student Suicide

12:29 March 31

అమ్మా నాన్నా ఐయామ్ సారీ.. అన్నా.. నేను చనిపోతున్నా.. నువ్వు అమెరికా నుంచి వచ్చేయ్

MBBS Student Suicide in Nizamabad : కొందరు విద్యార్థులు కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే జీవితంలో రాణించాలనే ఉన్నత ఆశయంతో కష్టపడి చదువుతున్నారు. పోటీ పరీక్షలలో రాణించి ఉన్నత విద్యలో రాణిస్తూ.. తాము ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని తీరా చివరి మెట్టుపై బోల్తా పడుతున్నారు. ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని మరిచి.. అలిసిపోయామంటూ మనోవేదనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు, జీవితాశయం గురించి ఆలోచించకుండా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచివెళ్తున్నారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చి కానరాని లోకాలకు పయనమవుతున్నారు. తాజాగా నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో.. ఆశయాలతో.. డాక్టర్ అవుదామనుకున్న ఓ వైద్యవిద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

10:11 March 31

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మరో విద్యార్థి ఆత్మహత్య

Medical Student Suicide
అమ్మా నాన్నా ఐయామ్ సారీ.. అన్నా.. నేను చనిపోతున్నా.. నువ్వు అమెరికా నుంచి వచ్చేయ్

నిజామాబాద్ ప్రభుత్వ వైద్యకళాశాలలో ఏడాది కాలంలో ముగ్గురు విద్యార్థులు చనిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. గత మే నెలలో శ్వేత చనిపోగా... నెల రోజుల క్రితం దాసరి హర్ష మృతిచెందాడు. తాజాగా... ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న సనత్‌ ఉరేసుకుని, ప్రాణాలు తీసుకున్నాడు. గత ఏడాది మే 15న వైద్యకళాశాలలో గైనిక్‌ పీజీ చదువుతున్న శ్వేత... అనుమానాస్పదస్థితిలో చనిపోయింది. గత నెల 25న మంచిర్యాల జిల్లా చింతగూడకు చెందిన ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న దాసరి హర్ష.... ఉరేసుకుని చనిపోయాడు. అనారోగ్య సమస్యల కారణంగానే హర్ష చనిపోయినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే అదే కళాశాలకు చెందిన సనత్‌ ఉరేసుకోవటం స్థానికంగా కలకలంరేపుతోంది.

పెద్దపల్లి సెంటనరీ కాలనీకు చెందిన సనత్‌... నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్యకళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాదికి సంబంధించి థియరీ పరీక్షలు ఇప్పటికే పూర్తి కాగా... సోమవారం నుంచి ప్రాక్టికల్స్‌ రాయాల్సి ఉంది. ఈ క్రమంలోనే రాత్రి విద్యార్థులతో కలిసి చదువుకున్న సనత్‌... స్నేహితులంతా ఎవరి గదులకు వారు వెళ్లగానే, సనత్‌ తన గదికి వెళ్లిపోయారు. ఉదయం తోటి విద్యార్థిలు.. 318 గదికి వెళ్లి చూడగా సనత్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని, విగతజీవిగా వేలాడుతున్నాడు. వెంటనే కళాశాల ప్రిన్సిపల్‌, పోలీసులకు సమాచారం ఇవ్వగా... వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు.

అమ్మానాన్నలకు సారీ... సోదరుడిని అమెరికా నుంచి వచ్చేయంటూ మెసేజ్ : గదిలో లభించిన సెల్‌ఫోన్‌ వాట్సప్‌ చాట్‌ను పరిశీలించిన పోలీసులు... రాత్రి 3గంటల 15నిమిషాల వేళ తల్లిదండ్రులకు మెసేజ్‌ పెట్టినట్లు గుర్తించారు. అమ్మానాన్నలకు సారీ.... తన సోదరుడిని అమెరికా నుంచి వచ్చేయమని మెసేజ్‌ పెట్టి... సనత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుడి మృతితో... తోటి విద్యార్థుల రోదనలతో వైద్యకళాశాలలో విషాదం నెలకొంది.

ఇవీ చదవండి :

Last Updated :Mar 31, 2023, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.