నిర్మల్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి.. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం పట్ల నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన నేతలను అడ్డుకోవడం ప్రభుత్వానికి తగదని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
సమస్యల పరిశీలనకు వచ్చిన ప్రజా ప్రతినిధులను అడ్డుకున్న ప్రభుత్వం.. లాక్డౌన్ సమయంలో వెయ్యి మందితో కార్యక్రమాలు చేసిన మంత్రి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు సైతం అధికార పార్టీకి దాసోహం అయ్యారని విమర్శించారు. ప్రతిపక్షాల నోరు నొక్కి పాలించానుకోవడం ప్రభుత్వ మూర్ఖత్వం అన్నారు. ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మెహన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మండుతున్న ఎండలు