నిర్మల్ జిల్లా భైంసా, బెల్ తరోడా గ్రామాల మధ్య రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
తనూర్ మండలం హిప్నెల్లి తండాకు చెందిన లక్ష్మీభాయ్, సంపత్ దంపతులు భైంసా నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇదీ చూడండి: ఖైరతాబాద్ సర్కిల్లో డివైడర్ను ఢీకొట్టిన కారు