ETV Bharat / state

కరోనా సోకిందనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : May 9, 2021, 2:32 PM IST

person committed suicide due to corona
కరోనా సోకిందని వ్యక్తి ఆత్మహత్య

కరోనా సోకిందని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి సభ్యులు తనను ప్రత్యేకంగా వేరే ఇంట్లో ఉంచడంతో ఆందోళనకు గురయ్యాడు. నారాయణ పేట జిల్లా గుడిమున్కన్​పల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నారాయణ పేట జిల్లా దామరగిద్ద మండలం గుడిమున్కన్​పల్లిలో కరోనా సోకిన వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఉలిగుండం నర్సప్ప(50)కి 5 రోజుల క్రితం కరోనా సోకింది. హోం క్వారంటైన్​లో భాగంగా కుటుంబ సభ్యులు అతనిని వారి పాత ఇంట్లో ఉంచారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నర్సప్ప.. శనివారం రాత్రి ఫ్యానుకు ఉరేసుకొని బలవన్మరణం చేసుకున్నాడు. కొవిడ్​ నిబంధనల నడుమ ఉదయం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి: కరోనాతో కార్పొరేటర్ కుమార్తె మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.