ETV Bharat / state

లాఠీఛార్జీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీకే అరుణ

author img

By

Published : Jan 3, 2021, 8:47 PM IST

dk aruna press meet in narayanapeta district
లాఠీఛార్జీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీకే అరుణ

భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జీ చేసిన పోలీసులను సస్పెండ్​ చేయాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల పరిధిలో భాజపా కార్యకర్తలపై పోలీసుల వ్యవహరించిన తీరును ఆమె ఖండించారు.

నారాయణపేట జిల్లా ధన్వాడ మండల పరిధిలో భాజపా కార్యకర్త పై లాఠీఛార్జీ చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్​ చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలపై పెట్టిన రౌడీషీటర్ కేసులను ఎత్తి వేయాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ వెంటనే స్పందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో తెరాస ప్రభుత్వం ప్రధాన మంత్రి మోదీ చిత్రపటాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: రోజుకు పదిలక్షల మందికి కరోనా టీకా: మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.