ETV Bharat / state

యాదాద్రి పవర్​​ప్లాంట్​ వలస కూలీల మొదటి విడత తరలింపు

author img

By

Published : May 9, 2020, 3:23 PM IST

లాక్​డౌన్​ కారణంగా చిక్కుకుపోయిన యాదాద్రి పవర్​ప్లాంట్​లో పనిచేస్తున్న వలస కూలీలను అధికారులు హైదారాబాద్​కు తరలించారు. తరలింపులో భాగంగా 107 మందిని ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్​కు పంపించారు. అక్కడి నుంచి రైలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

yadadri power plant migrants going to their own places
యాదాద్రి పవర్​​ప్లాంట్​ వలస కూలీల మొదటి విడత తరలింపు

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి పవర్ ప్లాంట్​లో పనిచేస్తున్న వలస కూలీలను ఎట్టకేలకు హైదరాబాద్​కు తరలించారు.యాదాద్రి పవర్ ప్లాంట్​లో 1500 మంది వలస కూలీలు పనిచేస్తుండగా.. సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి ఇష్టపడే వారిని మొదటి విడతగా ఆరోగ్య పరీక్షలు చేసి 3 ప్రత్యేక బస్సుల్లో తరలించారు.

బిహార్​కు చెందిన 40 మంది, జార్ఖండ్​కు చెందిన 38 మంది, ఉత్తర ప్రదేశ్​కు చెందిన 16 మంది, పశ్చిమ బంగాకు చెందిన 13 మంది కాగా మొత్త 107 మందిని హైదారబాద్​కు పంపించారు. అక్కడి నుంచి రైల్లో వారి స్వస్థలాలకు పంపే ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : భోపాల్​ నుంచి విశాఖ వరకు.. చీకటి నింపిన గ్యాస్​ లీక్​లెన్నో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.