ETV Bharat / state

South India Travel Photographer Aravind : సౌత్ ఇండియా అందాలను క్లిక్​మనిపిస్తున్న అరవింద్

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2023, 2:37 PM IST

South India Travel Photographer Aravind : ఆ యువకుడి జీవితం త్రివేణి సంగమంలాంటింది. సాహిత్యం, సినిమా, ఫొటోగ్రఫి కలయిక. అమ్మ నవ్వు.. ఫొటోగ్రఫీ వైపు మళ్లిస్తే.., సాహిత్యం.. తనను సినీ ప్రపంచానికి దగ్గర చేసింది. అందుకే ఈ మూడింటి కలయికగా.. సుదూర ప్రాంతాలకు ఒంటరిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. తాను చదివిన నవలల్లోని ప్రకృతి సోయగాలు తరిచి చూడాలన్న కలను ఫొటోగ్రఫీతో సాకారం చేసుకుంటూ ముందుకు సాగాడు. ఏడాది వ్యవధిలో దక్షిణాది రాష్ట్రాలను చుట్టేశాడు. ఆ జ్ఞాపకాలను ఇటీవలే ప్రదర్శనకు పెట్టాడీ యువకుడు. మరి, అతడెవరో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.

Aravind AV
South India Traveler Photographer Aravind AV
South India Traveler Photographer Aravind AV దక్షిణ భారతాన్ని చుడుతూ.. ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధిస్తున్న యువ రచయిత

South India Travel Photographer Aravind : అరవింద్ ఏవీ ఒంటి పేరుకు ఇంటి పేరు ముడిపెట్టడం ఇష్టం లేక.. అమ్మ అంజమ్మ పేరు లోని మొదటి అక్షరాన్ని, నాన్న వెంకటయ్య పేరు మొదటి అక్షరాన్నే ఇంటిపేరుగా మార్చుకున్న నేటి తరం కుర్రాడు. అమ్మానాన్నలే తన అస్థిత్వం అంటూ ఘంటాపథంగా చెబుతున్నఅరవింద్.. పాతికేళ్ల ప్రాయంలోనే యువ రచయిత, సాహిత్యాభిలాషి, ఫొటోగ్రాఫర్​గా పేరు తెచ్చుకున్నాడు. తాను తీసిన ఫొటోలను ప్రదర్శనకు ఉంచి పలువురి ప్రశంసలు అందుకున్నాడు

నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని మేడారం గ్రామంలో పుట్టిన అరవింద్​కు పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు. అదే అభిరుచి ఇతడి భవిష్యత్​కు కొత్తదారి చూపించింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లోని అనువాద నవలలూ చదివేవాడు. వాటి ప్రేరణతోనే ట్రావెలింగ్‌ ప్రారంభించాడు. ఫొటోగ్రఫర్​గా మారాడు అరవింద్‌. తీసిన ఫొటోల్ని.., తాను చదివిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఇటీవల ప్రదర్శించాడీ యువకుడు.

Folk Dancer Lasya Special Story : స్టెప్పేస్తే చాలు.. రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్​.. డ్యాన్సర్​ లాస్య గురించి ఈ విషయాలు తెలుసా..?

సరిలేరు సంగీతకు.. చదివింది నాలుగో తరగతి.. పది మందికి ఉపాధి కల్పిస్తోంది

"మా అమ్మ నేను ఫొటోలు తీస్తున్నప్పుడు అడ్డు చెప్పలేదు. దక్షిణ భారత్​లో ఉన్న టూరిస్ట్ ప్రదేశాల గురించి నేను పుస్తకాల్లో ఏదైతే చదువుతున్నానో అదే నేను చూస్తున్నాను. ఈ ఊళ్లు, ప్రకృతి అంతా పుస్తకాల్లో ఉన్నట్లే ఉంది. వీటన్నింటిని నేచురల్​గా ఫొటోలు తీసి అందరికి చూపించాలనే ఉద్దేశంతో ఇలా తీసి డిస్​ప్లేకి పెట్టాను. సాహిత్యం నన్ను నడిపించింది దాన్నే నేను సోషల్​ మీడియా ద్వారా పంచుకుంటున్నాను." - అరవింద్, యువ రచయిత

Travel Photographer Aravind Captures South India Landscapes : పర్షియన్ రచయిత రోమి చెప్పిన ఓ మాటతో ప్రయాణం ప్రారంభించాడు అరవింద్. నువు బయటికి వెళ్లేందుకు అడుగు వేస్తే చాలు.. ప్రపంచమంతా దారిస్తుంది అన్న ఆ మాటే తన ప్రయాణానికి స్ఫూర్తైంది అంటున్నాడు. జాతి రత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ వద్ద రచయితగా పనిచేసే అవకాశం పొందాడు అరవింద్‌. 8 ఏళ్ల కిందట పుస్తక సమీక్షల్లో అనుదీప్ పరిచయం అయ్యాడు. వారిలో కామన్‌గా ఉన్న ఆ సాహిత్యాభిలాషే వారిని స్నేహితుల్ని చేసింది. అంతేగాక అరవింద్ యాత్రకు అనుదీప్ సహాయంగానూ నిలిచాడు.

ట్రావెలింగ్‌ చేయాలంటే దక్షిణ భారతదేశం నుంచి ప్రారంభించాలని అంటున్నాడు అరవింద్‌ . ఇక్కడి భౌగోళిక, సామాజిక పరిస్థితులు అర్థం చేసుకుంటే ట్రావెలింగ్‌లో రాణించవచ్చని చెబుతున్నాడు. దక్షిణ భారతంలో తిరుగుతూ తీసిన చిత్రాలను ఇటీవల ప్రదర్శనకు ఉంచాడు. వాటిని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి ఓల్గా, దర్శకుడు అనుదీప్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రెస్‌ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ సహా మరికొంత మంది ప్రముఖులు వీక్షించారు. అంతేగాక అరవింద్ ప్రతిభను ప్రశంసించారు.

"అతని అభిరుచుల గురించి అందరికి తెలుసు.. అది ఇక్కడ ఉన్న ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు చూస్తున్న ఫొటోలు కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్రకు ఏదో ఒకదానికి సాక్ష్యంగా నిలుస్తాయి. అరవింద్ తన లైఫ్​లో ఇలానే ముందుకెళ్లాలి అనుకుంటున్నాను." - ఓల్గా, రచయిత్రి

Special Story On Nalgonda Shaik Sayyed PhD : తినడానికి తిండి లేని స్థితి నుంచి డాక్టరేట్​గా.. సయ్యద్ ప్రయాణం ఆదర్శప్రాయం

Gongadi Wool Shoes : 'గొంగడి'తో షూస్.. ఐడియా అదిరింది బాస్

South India Traveler Photographer Aravind AV దక్షిణ భారతాన్ని చుడుతూ.. ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధిస్తున్న యువ రచయిత

South India Travel Photographer Aravind : అరవింద్ ఏవీ ఒంటి పేరుకు ఇంటి పేరు ముడిపెట్టడం ఇష్టం లేక.. అమ్మ అంజమ్మ పేరు లోని మొదటి అక్షరాన్ని, నాన్న వెంకటయ్య పేరు మొదటి అక్షరాన్నే ఇంటిపేరుగా మార్చుకున్న నేటి తరం కుర్రాడు. అమ్మానాన్నలే తన అస్థిత్వం అంటూ ఘంటాపథంగా చెబుతున్నఅరవింద్.. పాతికేళ్ల ప్రాయంలోనే యువ రచయిత, సాహిత్యాభిలాషి, ఫొటోగ్రాఫర్​గా పేరు తెచ్చుకున్నాడు. తాను తీసిన ఫొటోలను ప్రదర్శనకు ఉంచి పలువురి ప్రశంసలు అందుకున్నాడు

నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని మేడారం గ్రామంలో పుట్టిన అరవింద్​కు పుస్తకాలు చదవడం చిన్నప్పటి నుంచి అలవాటు. అదే అభిరుచి ఇతడి భవిష్యత్​కు కొత్తదారి చూపించింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లోని అనువాద నవలలూ చదివేవాడు. వాటి ప్రేరణతోనే ట్రావెలింగ్‌ ప్రారంభించాడు. ఫొటోగ్రఫర్​గా మారాడు అరవింద్‌. తీసిన ఫొటోల్ని.., తాను చదివిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఇటీవల ప్రదర్శించాడీ యువకుడు.

Folk Dancer Lasya Special Story : స్టెప్పేస్తే చాలు.. రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్​.. డ్యాన్సర్​ లాస్య గురించి ఈ విషయాలు తెలుసా..?

సరిలేరు సంగీతకు.. చదివింది నాలుగో తరగతి.. పది మందికి ఉపాధి కల్పిస్తోంది

"మా అమ్మ నేను ఫొటోలు తీస్తున్నప్పుడు అడ్డు చెప్పలేదు. దక్షిణ భారత్​లో ఉన్న టూరిస్ట్ ప్రదేశాల గురించి నేను పుస్తకాల్లో ఏదైతే చదువుతున్నానో అదే నేను చూస్తున్నాను. ఈ ఊళ్లు, ప్రకృతి అంతా పుస్తకాల్లో ఉన్నట్లే ఉంది. వీటన్నింటిని నేచురల్​గా ఫొటోలు తీసి అందరికి చూపించాలనే ఉద్దేశంతో ఇలా తీసి డిస్​ప్లేకి పెట్టాను. సాహిత్యం నన్ను నడిపించింది దాన్నే నేను సోషల్​ మీడియా ద్వారా పంచుకుంటున్నాను." - అరవింద్, యువ రచయిత

Travel Photographer Aravind Captures South India Landscapes : పర్షియన్ రచయిత రోమి చెప్పిన ఓ మాటతో ప్రయాణం ప్రారంభించాడు అరవింద్. నువు బయటికి వెళ్లేందుకు అడుగు వేస్తే చాలు.. ప్రపంచమంతా దారిస్తుంది అన్న ఆ మాటే తన ప్రయాణానికి స్ఫూర్తైంది అంటున్నాడు. జాతి రత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ వద్ద రచయితగా పనిచేసే అవకాశం పొందాడు అరవింద్‌. 8 ఏళ్ల కిందట పుస్తక సమీక్షల్లో అనుదీప్ పరిచయం అయ్యాడు. వారిలో కామన్‌గా ఉన్న ఆ సాహిత్యాభిలాషే వారిని స్నేహితుల్ని చేసింది. అంతేగాక అరవింద్ యాత్రకు అనుదీప్ సహాయంగానూ నిలిచాడు.

ట్రావెలింగ్‌ చేయాలంటే దక్షిణ భారతదేశం నుంచి ప్రారంభించాలని అంటున్నాడు అరవింద్‌ . ఇక్కడి భౌగోళిక, సామాజిక పరిస్థితులు అర్థం చేసుకుంటే ట్రావెలింగ్‌లో రాణించవచ్చని చెబుతున్నాడు. దక్షిణ భారతంలో తిరుగుతూ తీసిన చిత్రాలను ఇటీవల ప్రదర్శనకు ఉంచాడు. వాటిని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి ఓల్గా, దర్శకుడు అనుదీప్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రెస్‌ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ సహా మరికొంత మంది ప్రముఖులు వీక్షించారు. అంతేగాక అరవింద్ ప్రతిభను ప్రశంసించారు.

"అతని అభిరుచుల గురించి అందరికి తెలుసు.. అది ఇక్కడ ఉన్న ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు చూస్తున్న ఫొటోలు కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్రకు ఏదో ఒకదానికి సాక్ష్యంగా నిలుస్తాయి. అరవింద్ తన లైఫ్​లో ఇలానే ముందుకెళ్లాలి అనుకుంటున్నాను." - ఓల్గా, రచయిత్రి

Special Story On Nalgonda Shaik Sayyed PhD : తినడానికి తిండి లేని స్థితి నుంచి డాక్టరేట్​గా.. సయ్యద్ ప్రయాణం ఆదర్శప్రాయం

Gongadi Wool Shoes : 'గొంగడి'తో షూస్.. ఐడియా అదిరింది బాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.