ETV Bharat / state

ప్రజలను కాపాడుకోవడమే భాజపా ధ్యేయం: బండి సంజయ్

author img

By

Published : Apr 15, 2021, 5:52 PM IST

ప్రజలను కాపాడుకోవడమే తమ ప్రధాన ధ్యేయమని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తమ పార్టీకి కావాల్సింది ఓట్లు, సీట్లు, నోట్లు కాదన్నారు. సాగర్​ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో రోడ్​షో అనంతరం ఆయన మాట్లాడారు.

bandi sanjay fires on cm kcr
bandi sanjay fires on cm kcr

భాజపాకు కావాల్సింది ఓట్లు, సీట్లు, నోట్లు కాదని.. ప్రజలను కాపాడుకోవడమే పార్టీ ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

సాగర్​ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో రోడ్​షో అనంతరం సంజయ్​ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిజాం చక్కెర కర్మాగారాన్ని ఎందుకు తెరవలేకపోయారని బండి ప్రశ్నించారు. ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: గిరిజన నాయకుని ఇంట బండి సంజయ్​ భోజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.