ETV Bharat / state

అచ్చంపేటలో సమీకృత మార్కెట్‌ను అభివృద్ధి చేస్తాం: కేటీఆర్‌

author img

By

Published : Apr 14, 2021, 6:56 PM IST

Updated : Apr 14, 2021, 7:55 PM IST

KTR
అచ్చంపేటలో రోడ్డు విస్తరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మించే అంబేడ్కర్​ విజ్ఞాన భవనానికి, అచ్చంపేటలోని అచ్చంపేటలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

అచ్చంపేటలో సమీకృత మార్కెట్‌ను అభివృద్ధి చేస్తాం: కేటీఆర్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో తెరాస సభలో మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. అచ్చంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహం, చాకలి ఐలమ్మ, మహేంద్రనాథ్ విగ్రహాలకు నివాళులర్పించిన కేటీఆర్... తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేశారు. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో నిర్మించే అంబేడ్కర్​ విజ్ఞాన భవనానికి, అచ్చంపేటలోని రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై భారీ వంతెన నిర్మిస్తామని మంత్రి కేటీఆర్​ అచ్చంపేట తెరాస సభలో హామీనిచ్చారు. ఉమామహేశ్వరం, చెన్నకేశవ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తామని అన్నారు. ఉపాధి అవకాశాలు పెరిగేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అచ్చంపేటలో సమీకృత మార్కెట్‌ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

Last Updated :Apr 14, 2021, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.