విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని ఆకాక్షించారు నాగర్కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు. నిరుపేద, వెనుకబడిన వర్గాల విద్యార్థుల భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండల కేంద్రంలోని టీఎస్డబ్యూఆర్ఈఎస్లో ఇంపల్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఎంపీ, ప్రభుత్వ చీఫ్ విప్ గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 9 జిల్లాలకు చెందిన 256 మంది విద్యార్థులు, 54 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గువ్వల బాలరాజు అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?