ETV Bharat / state

జిల్లా ఆస్పత్రి వద్ద కొవిడ్​ అనుమానితుల ఆందోళన

author img

By

Published : Apr 25, 2021, 3:38 PM IST

కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు నిలిపివేయడం వల్ల నాగర్​ కర్నూలు జిల్లా ఆస్పత్రి వద్ద కొవిడ్​ అనుమానితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కొవిడ్​ టెస్టులు చేయకపోవడం ఏంటని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

కరోనా వార్తలు
తెలంగాణ వార్తలు

నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రి వద్ద కొవిడ్​ నిర్ధరణ పరీక్షల కోసం వచ్చిన వారు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో కొవిడ్​ టెస్టులు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి క్యూలో నిలబడి పడిగాపులు కాస్తుంటే... ఇప్పుడొచ్చి పరీక్షలు చేయడం లేదని చెప్పడం ఏంటని వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

ఓవైపు కొవిడ్​ కేసులు పెరుగుతుంటే పరీక్షలు నిలిపేయడం ఏంటని ప్రశ్నించారు. ఆస్పత్రి ఆవరణలో కొంతసేపు గందరగోళం నెలకొంది. తక్షణమే తమకు పరీక్షలు చేయాలని ప్రజలు డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: తెలంగాణలో ఆస్పత్రులు ఎంత భద్రం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.