ETV Bharat / state

తెరాస పతనం ఆరంభమైంది: బండి సంజయ్​

author img

By

Published : Mar 6, 2021, 4:04 PM IST

తెరాస పతనం ఆరంభమైంది: బండి సంజయ్​
తెరాస పతనం ఆరంభమైంది: బండి సంజయ్​

రాష్ట్రంలో తెరాస పతనం ఆరంభమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. 2023లో వచ్చేది భాజపా ప్రభుత్వమేనన్నారు. జిల్లా కల్వకుర్తి పట్టణంలో అనారోగ్యంతో ఉన్న భాజపా జిల్లా ప్రధానకార్యదర్శి దుర్గాప్రసాద్​ను బండి పరామర్శించారు.

నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో అనారోగ్యంతో ఉన్న భాజపా జిల్లా ప్రధానకార్యదర్శి దుర్గాప్రసాద్​ను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పరామర్శించారు. తెరాస పార్టీలో అభ్యర్థులు లేక కాంగ్రెస్​ పార్టీకి టికెట్​ ఇచ్చిన ఘనత కేసీఆర్​దని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని.. తెరాస పతనం ఆరంభమైందని సంజయ్​ పేర్కొన్నారు. 2014 ఉద్యమ సమయంలో పీవీ నర్సింహరావును తీవ్రంగా విమర్శించిన నాయకులే ఇప్పుడు పీవీ ఫొటోతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

టీఎన్జీవో ఉద్యోగుల ద్వారా శ్రీనివాస్​ గౌడ్​ మంత్రి పదవిని పొందారని... ఆయన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కుటుంబ సభ్యుల కోసం సొంత జీవోలు తీసుకొచ్చారని బండి సంజయ్​ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, భాజపా జిల్లా అధ్యక్షుడు సుధాకర్​రావు, ఇతర నేతలు పాల్గొన్నారు.

తెరాస పతనం ఆరంభమైంది: బండి సంజయ్​

ఇదీ చదవండి: 'తెరాస నిర్లక్ష్యం వల్లే రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఆలస్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.