ETV Bharat / state

ములుగులో మావోయిస్టుల బంద్.. పోలీసుల తనిఖీలు

author img

By

Published : Jul 25, 2020, 12:34 PM IST

mavoists bundh in mulugu
ములుగులో మావోయిస్టుల బంద్.. పోలీసుల తనిఖీలు

ములుగు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు బంద్ పాటించాలంటూ మావోయిస్టులు కరపత్రాలను విడుదల చేశారు. అందులో భాగంగానే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా ఉండేందుకు పోలుసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ములుగు జిల్లాలో కొద్దిరోజులుగా మావోయిస్టులు బంద్ పాటించాలంటూ కరపత్రాలను విడుదల చేశారు. మావోయిస్టులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 9 మండలాలలైన గోవిందరావుపేట, వెంకటాపూర్, ములుగు, తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మండలంలో వాణిజ్య వ్యాపారాలు సజావుగానే కొనసాగుతున్నాయి.

గోదావరి తీర ప్రాంతమైన వాజేడు, వెంకటాపురం మండలంలో మావోయిస్టుల బంద్​తో వ్యాపారస్థులు అన్ని దుకాణాలను మూసేశారు. వాటిని తెరవాలంటూ పోలీసులు చెప్పడం వల్ల కొందరు దుకాణాలను తెరుస్తున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.