ETV Bharat / state

శరీరంపై పెయింటింగ్​ వేసుకుని ప్రచారం

author img

By

Published : Feb 7, 2020, 8:14 AM IST

మేడారం జాతరలో ఓ యువకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 'ప్లాస్టిక్​ను వాడకండి.. మేడారంను రక్షించండి' అనే నినాదాన్ని ఒంటిపై పెయింటింగ్​ వేసుకుని జాతరలో తిరుగుతూ ప్రచారం చేశాడు.

plastic awareness to the people painting on the body at medaram jatara
శరీరంపై పెయింటింగ్​ వేసుకుని ప్రచారం

ములుగు జిల్లా మేడారం జాతరలో ప్లాస్టిక్​ను నిషేధిస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఓ యువకుడు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించాడు. ప్లాస్టిక్ రహిత జాతర కోసం ఆ యువకుడు తన శరీరంపై 'ప్లాస్టిక్​ను వాడకండి మేడారంను రక్షించండి' అంటూ పెయింటింగ్ వేసుకుని జాతరలో తిరుగుతూ ప్రచారం చేశాడు.

ప్లాస్టిక్​ను వాడొద్దు, గాలి, నీరు, భూమిని కలుషితం చేయోద్దంటూ రాసుకుని ప్రచారం చేశారు. నర్సంపేటకు చెందిన ఏఎస్ఆర్ స్వచ్ఛంద సంస్థ తరపున అతను పాల్గొన్నారు.

శరీరంపై పెయింటింగ్​ వేసుకుని ప్రచారం

ఇదీ చూడండి : నేడు మేడారానికి గవర్నర్లు, ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.