ETV Bharat / state

Mulugu Floods 2023 : వరద ముంచెత్తింది.. కొండాయి గ్రామం గుండె పగిలింది

author img

By

Published : Jul 29, 2023, 7:19 AM IST

Updated : Jul 29, 2023, 8:12 AM IST

Mulugu Flood
Mulugu Flood

Kondai Villagers Died Mulugu Floods 2023 : ములుగు జిల్లాలోని కొండాయి గ్రామంలో వరణుడు బీభత్సం సృష్టించాడు. వరద విలయం ఆ గ్రామానికి శోకాన్ని మిగిల్చింది. ఆ గ్రామంలో ఎనిమిదిని జలసమాధి చేసింది. వరద ముప్పును తప్పించుకుందామని.. సురక్షిత ప్రాంతానికి వెళ్తున్న వారంతా.. వరదలో చిక్కుకుని జలసమాధి అయ్యారు.

వరదొచ్చే తీవ్ర విషాదం మిగిల్చే.. 8 మంది జలసమాధి

Eight People Died Due To Floods In Mulugu : భారీ వర్షాలు, వరదలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయ్‌లో అంతులేని విషాదం మిగిల్చింది. జంపన్నవాగు వరద ఉద్ధృతి గ్రామాన్ని ముంచెత్తగా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతూ.. ఆ క్రమంలోనే 8 మంది జలసమాధయ్యారు. ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు మృతదేహాల ఆచూకీ కనుగొని బంధువులకు అప్పగించారు.

Kondai Villagers Died Mulugu Floods 2023 : వర్షాలు, వరదలు కొండాయ్ గ్రామస్థులకు కొత్తేం కాదు. గతంలో ఎన్నోసార్లు వరదలు గ్రామాన్ని చుట్టిముట్టినా ఈసారి మాత్రం తీరని విషాదాన్ని మిగిల్చాయి. వరద పెద్దగా రాదని తొలుత భావించిన గ్రామస్థులు.. అనంతరం వాగు ఉద్ధృతి చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామాన్ని ముంచెత్తుతుందని భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కుకు పరిగెత్తారు. కొందరు మాల్యాల, గోవిందరాజుల గ్రామాల వైపు వెళ్లారు. మరికొందరు స్థానిక ఆశ్రమం, పాఠశాల భవనం, గ్రామ పంచాయతీ భవనాలెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. కొండాయ్, మాల్యాల గ్రామాల మధ్య కొత్తగా కల్వర్టు నిర్మించగా.. వరద ఉద్ధృతికి కోతకు గురైంది. దీంతో ఎనిమిది మంది రోడ్డును అనుకుని ఆ గుంతలో పడి... కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు.

Mulugu Floods 2023 : రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన గిరిజనులకు.. రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా ఆహార ప్యాకెట్లు, నీళ్ల సీసాలు, మెడికల్ కిట్లు అందిచింది. గురువారం ఉదయం నుంచి ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులకు.. శుక్రవారం ఉదయం పోలీసులు వెళ్లేవరకూ వారికి ఏమీ తినేందుకు లేవు. సాయం కోసం దీనంగా ఉండిపోవాల్సిన పరిస్ధితి నెలకొంది.

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వర్షపాతం : రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడని.. అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు దెబ్బకు ములుగు జిల్లా కకావికలం అయింది. ఈ జిల్లా ప్రాంతంలోనే తొలిసారి అత్యంత భారీ వర్షపాతం 64 సెంటీమీటర్లు లక్ష్మీదేవిపేట అనే గ్రామంలో కురిసింది. అలాగే భూపాలపల్లి చిట్యాల మండలంలో కూడా 61 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదయింది. ములుగు జిల్లాలో వరద బీభత్సం సృష్టించిందనే చెప్పాలి.

Mulugu Rains 2023 : ఎక్కడకక్కడ వాగులు, వంకలు కోతలకు గురై.. వరద నీరు గ్రామాలపై దండయాత్రకు వచ్చినట్లు ముంచెత్తిపోసింది. వరదల పరిసరాల్లోని గ్రామల ప్రజలు భవనాలు, చెట్లు ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారంటే.. వరద ఉద్ధృతి ఏ రేజ్​లో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. పాపం ఈ వరదల వల్ల ఎందరో అభాగ్యులుగా కట్టుకున్న బట్ట తప్ప ఏమీలేని నిరాధార స్థితిలో నిలిచారు. ప్రభుత్వం తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని.. వరద ప్రభావిత ప్రాంతాల గ్రామస్థులు కోరారు.

ఇవీ చదవండి :

Last Updated :Jul 29, 2023, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.