ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య పరికరాలు అందించిన దాతలు

author img

By

Published : May 22, 2021, 11:28 AM IST

ములుగు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి దాతలు వైద్య పరికరాలను అందజేశారు. కరోనా చికిత్సలో ఉపయోగించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, హ్యాండ్ గ్లౌజ్​లను అందించారు. దాతల సాయంపై ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు.

medical instruments donations, mla seethakka
ములుగు ఆస్పత్రికి వైద్యపరికరాలు, ఎమ్మెల్యే సీతక్క

ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి బ్రింగ్ ఏ స్మైల్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రిచర్డ్, ఆర్వీ ప్రసాద్​ల సహకారంతో సమారిటన్స్ ఫర్ ద నేషన్ ఎన్జీవో సాయం చేసింది. కరోనా బాధితుల చికిత్సలో ఉపయోగించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిమీటర్లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, హ్యాండ్ గ్లౌజ్​లను ఆ సంస్థ ప్రతినిధులు ఆస్పత్రి సూపరింటెండెంట్​కు అందజేశారు. ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి సమక్షంలో అందించారు.

నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లా అభివృద్ధికి సాయం చేస్తూ… కరోనా నియంత్రణకు వైద్య పరికరాలను అందించడం పట్ల ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కష్టకాలంలో సాయం చేయడానికి ముందుకొచ్చిన దాతలను అభినందించారు.

ఇదీ చదవండి: ఆగని మరణాలు- మరో 4,194 మంది వైరస్​కు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.