ETV Bharat / state

రామానాయుడు ట్రస్ట్​ ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసర సరకుల పంపిణీ

author img

By

Published : Nov 6, 2020, 6:04 PM IST

జలగలంచ గుత్తికోయ గిరిజన గూడెంలో రామానాయుడు చారిటబుల్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసర సరకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యాక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క గిరిజనులకు సరకులు అందించారు.

రామానాయుడు ట్రస్ట్​ ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసర సరకుల పంపిణీ
రామానాయుడు ట్రస్ట్​ ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసర సరకుల పంపిణీ

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జలగలంచ, గుత్తి కోయ గూడెంలోని గిరిజనులకు రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. దగ్గుపాటి రాణా పంపించిన వస్తువులను ఎమ్మెల్యే సీతక్క గిరిజనులకు అందించారు.

శీతాకాలంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న ఆదివాసులకు.. దగ్గుపాటి ట్రస్ట్​ నుంచి దుప్పటి, నిత్యవసర సరకులు అందించిన నటుడు రాణాకు ఎమ్మెల్యే సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.