ETV Bharat / state

డిసెంబర్​లో అసెంబ్లీ రద్దు.. మార్చిలో ఎన్నికలు.. కార్యకర్తల సభలో రేవంత్

author img

By

Published : Mar 5, 2022, 5:24 PM IST

Updated : Mar 5, 2022, 5:36 PM IST

అవినీతికి చిట్టా బయటపడుతుందనే సీఎం కేసీఆర్​ రోజుకో నాటకానికి తెరలేపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. డిసెంబర్​లో సీఎం కేసీఆర్​ అసెంబ్లీని రద్దు చేస్తారని అన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని రేవంత్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

revanth reddy
revanth reddy

డిసెంబర్​లో అసెంబ్లీ రద్దు.. మార్చిలో ఎన్నికలు.. కార్యకర్తల సభలో రేవంత్

ప్రధాని మోదీని కథ తేలుస్తా.. గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి అన్నారు. ఝూర్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్​ను కలిసిన తర్వాత భాజపాకు వ్యతిరేకంగా ఏ ఫ్రంట్​ పెట్టట్లేదని కేసీఆర్ చెప్పారని విమర్శించారు. దిల్లీలో ముఖ్యమంత్రిని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి కలిసి ఆయన దోపిడీ గురించి లెక్క చెప్పారని... దీంతో ఫ్రంట్​పై మాట మార్చారని ఆరోపించారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా అన్నోజీగూడలో కాంగ్రెస్​ కార్యకర్తలతో రేవంత్​రెడ్డి సమావేశమయ్యారు.

పథకాల్లో వారికే ప్రాధాన్యత

కాంగ్రెస్​ అధికారంలోకి వస్తుందని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో కాంగ్రెస్​లో చేరిన వారికే పథకాల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్​ కార్యకర్తలు సూచించిన వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని... రాజకీయ అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వాళ్ల ద్వారానే పరిపాలన చేస్తామని పేర్కొన్నారు.

తెలంగాణలో ముందస్తు

రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు అధికారం చలాయించరని... తమ నాయకులను ముందు పెట్టి పాలన చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకునేవాళ్లకు కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. డిసెంబర్​లో సీఎం కేసీఆర్​ అసెంబ్లీని రద్దు చేస్తారని... మార్చిలో ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ పేదల కష్టాలు తీర్చాల్సినవారు దేశాలు పట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు.

చివరి గింజ వరకూ కొంటాం

12 నెలలు కష్టపడితే అధికారం కాంగ్రెస్​దేనని రేవంత్​ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయంబర్స్​మెంట్​, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. పేదల దగ్గర ఆసైన్​ భూములను ప్రభుత్వం గుంజుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక... ఆ భూములపై వాళ్లకే హక్కులు ఇస్తామని భరోసా ఇచ్చారు. బస్తీలను అభివృద్ధి చేస్తామని అన్నారు. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ కొంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి : 'ఫ్రంట్​ గురించి చర్చించలేదు.. ప్రత్యామ్నాయ విధానంలో భాగంగానే.. '

Last Updated :Mar 5, 2022, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.