ETV Bharat / state

కంట్రోల్ రూమ్​ను సంప్రదిస్తే ఆక్సిజన్ సిలిండర్: మహేశ్ భగవత్

author img

By

Published : May 15, 2021, 4:01 PM IST

Rachakonda CP mahesh bhagavath
రాచకొండ సీపీ మహేశ్ భగవత్

కరోనా రెండో దశలో హోం ఐసోలేషన్​లో ఉన్నవారికి ఆక్సిజన్ అందించే కార్యక్రమాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. ఆక్సిజన్ అవసరమైనవారు కొవిడ్ కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్​కు కాల్ చేయాలని ఆయన సూచించారు.

కరోనా కష్ట సమయంలో బాధితులకు ప్రాణవాయువు అందించనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నేరెడ్​మెట్​లోని పోలీస్ కమిషనరేట్​లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్​ను ఆయన ప్రారంభించారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్, డీఆర్డీవో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఫ్లాస్మా డొనేషన్​కు సంబంధించిన వెబ్​సైట్, షార్ట్ ఫిలింను సీపీ ప్రారంభించారు.

హోం ఐసోలేషన్ లో ఉన్న బాధితులకు ఆక్సిజన్ అవసరమైన సమయంలో కమిషనరేట్​లోని కొవిడ్ కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్ 9490617234 కి కాల్ చేయాలని సూచించారు. ఆక్సిజన్​ అవసరం ఉన్నవాళ్లు డాక్టర్ ప్రిస్కిప్షన్, ఆధార్ కార్డు, పాజిటివ్ రిపోర్ట్ చూపిస్తే సిలిండర్ అందిస్తామని తెలిపారు.

కోలుకున్నవారు ఫ్లాస్మా డొనేట్​ చేయాలి

కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని సీపీ మహేశ్ భగవత్​ కోరారు. పదిహేను రోజుల తర్వాత ఎవరైనా ప్లాస్మా డొనేట్ చేయవచ్చని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ వ్యక్తి 21 సార్లు ఫ్లాస్మా దానం చేశారని ఆయన గుర్తు చేశారు. మా వెబ్ సైట్​ ద్వారా ఏ బ్లడ్ గ్రూప్ వారైనా తమను సంప్రదించవచ్చని సీపీ విజ్ఞప్తి చేశారు. మహిళా పోలీసులు కూడా ఫ్లాస్మా దానం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువత ముందుకు రావాలని సీపీ కోరారు.

ఇదీ చూడండి: డిసెంబర్​ వరకు 259 కోట్లకు పైగా టీకా డోసులు: కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.