ETV Bharat / state

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి దుర్మరణం

author img

By

Published : Jun 10, 2020, 12:52 PM IST

one man died in medchal road accident
మల్లాపూర్​లో రోడ్డు ప్రమాదం.. ఒకరి దుర్మరణం

మేడ్చల్ జిల్లా మల్లాపూర్ డివిజన్​​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు.. బైకు అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు.

మేడ్చల్ జిల్లా మల్లాపూర్ డివిజన్​లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆశోక్ నగర్​ కాలనీకి చెందిన విశాల్ మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై మేడ్చల్ బయలుదేరారు. మార్గం మధ్యలోని ఓ మూలమలుపు వద్ద బైకు అదుపుతప్పి కింద పడ్డారు.

విశాల్​ తల నేరుగా బండరాయిపై పడటం వల్ల అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు .. విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.