ETV Bharat / state

'అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బ‌ల‌ప‌డాలి'

author img

By

Published : Mar 8, 2021, 8:58 PM IST

సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

mlc kavitha attended womens day celebrations in boinpalli medchal
'అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బ‌ల‌ప‌డాలి'

మహిళలు.. సమాజంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రతి రంగంలో పురుషులతో సమానంగా రాణించాలని సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సికింద్రాబాద్​ బోయిన్​పల్లిలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ప్రస్తుత కాలంలో.. ఆర్థిక స్వావ‌లంబనతో మ‌హిళ‌ల‌కు నిర్ణ‌యాధికారం పెరుగుతుంద‌న్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: విరాటపర్వం: మహిళల గొప్పతనాన్ని చెప్పిన రానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.