ETV Bharat / state

జాతి ఐక్యత కోసం.. త్రివర్ణ పతాక సైకిల్​ ర్యాలీ

author img

By

Published : Jan 26, 2021, 12:29 PM IST

Updated : Jan 26, 2021, 7:03 PM IST

గణతంత్ర దినోత్సవ వేడుకలు మేడ్చల్​ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా.. ఎమ్మెల్యే వివేకానంద సైకిల్ రన్​ ప్రారంభించారు.

mla-vivekananda-hoisted-the-flag-at-soochitra-chowrasta-to-mark-the-republic-day
జాతి ఐక్యత కోసం.. త్రివర్ణ పతాక సైకిల్​ ర్యాలీ

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. మేడ్చల్​ జిల్లాలో సైకిల్​ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా చేతపట్టి సుమారు 130 మంది యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్​ సైక్లిస్ట్స్​ గ్రూప్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

సుచిత్ర చౌరస్తా వద్ద కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే జెండా ఊపి సైకిల్ రన్​ను​ ప్రారంభించారు. మేడ్చల్ జాతీయ రహదారిపై 100 కిలోమీటర్ల మేర ఈ రన్​ సాగింది. జాతి ఐక్యతను చాటడం కోసం త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించినట్లు యువకులు చెప్పారు.

ఈ విజయం అందరిదని.. ఇదే స్ఫూర్తితో సవాళ్లను ఎదుర్కొందామని.. సైక్లిస్ట్స్​ గ్రూప్ సభ్యులు అన్నారు.

cycle rally at medchal
జాతి ఐక్యత కోసం.. త్రివర్ణ పతాక సైకిల్​ ర్యాలీ
cycle rally at medchal
జాతి ఐక్యత కోసం.. త్రివర్ణ పతాక సైకిల్​ ర్యాలీ

ఇదీ చదవండి:రిపబ్లిక్ డే: దేశభక్తి ప్రధానంగా సాగిన చిత్రాలు!

Last Updated : Jan 26, 2021, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.