ETV Bharat / state

YS Sharmila Padayatra:నేడు రైతు ఆవేదన యాత్ర.. కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల

author img

By

Published : Dec 19, 2021, 3:37 AM IST

YS Sharmila Padayatra: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఇవాళ రైతు ఆవేదన యాత్ర చేపట్టబోతున్నారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయం నుంచి నుంచే యాత్ర ప్రారంభించనున్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం తనను ఆవేదనకు గురిచేసిందని షర్మిల పేర్కొన్నారు.

YS Sharmila Padayatra
వైయస్ షర్మిల ఇవాళ రైతు ఆవేదన యాత్ర

YS Sharmila Raithu Yatra: ప్రభుత్వ నిరంకుశ విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం తనను ఆవేదనకు గురిచేసిందని వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల అన్నారు. అందుకే రైతు ఆవేదన యాత్రను చేపడుతున్నట్లు వైయస్ షర్మిల పేర్కొన్నారు. యాసంగిలో వరి వేయవద్దని కేసీఆర్ చెప్పడం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.

sharmila comments on KCR: ఏడేళ్లలో ఇప్పటిదాకా 7 వేల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోగా.. గత రెండేళ్లలోనే 200 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందజేయాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. అందులో భాగంగా రైతు కుటుంబాలకు భరోసాను కల్పించేందుకు రైతు ఆవేదన యాత్రను చేపడుతున్నామన్నారు

రైతు ఆవేదన యాత్ర మొదటి రోజు వివరాలు:

Sharmila Padayatra: ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు లోటస్ పాండ్​లోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయం నుంచి యాత్ర ప్రారంభిస్తారు. ఉదయం మెదక్ జిల్లాలోని ఆంధోల్ నియోజకవర్గం, జోగిపేట్ మండలంలోని రైతు కుటుంబాన్ని వైయస్ షర్మిల పరామర్శిస్తారు. అక్కడి నుంచి నర్సాపూర్ నియోజకవర్గం, కౌడిపల్లి మండలం, కంచనపల్లికి వెళ్తారు. కంచనపల్లిలోని ఇద్దరు రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ తర్వాత కౌడిపల్లి మండలం, లింగంపల్లి గ్రామంలో మరొక రైతు కుటుంబాన్ని కలిసి పరామర్శించున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.