ETV Bharat / state

'బాబును క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం'

author img

By

Published : May 27, 2020, 10:38 PM IST

బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీశ్​ రావు తెలిపారు. బోరు బావుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే బోరు బావుల యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే అక్కడ మెదక్​ జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

'బాబును క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం'
'బాబును క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం'

మెదక్​ జిల్లా పోడ్చన్​ప్లలి బోరు బావి ఘటనలో సహాయ చర్యలను మంత్రి హరీశ్​ రావు పర్యవేక్షిస్తున్నారు. బాలుడిని క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ నుంచి సహాయక బృందాలను పిలిపించామన్నారు. హైదరాబాద్ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిపుణులు వస్తున్నట్లు హరీశ్​ రావు పేర్కొన్నారు. బోరు బావుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే బోరు బావుల యజమానులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: మెదక్‌ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.