ETV Bharat / state

కౌడిపల్లిలో రక్తదాన శిబిరం

author img

By

Published : Sep 17, 2020, 10:42 PM IST

blood donation camp at kowdipally medak district
కౌడిపల్లిలో రక్తదాన శిబిరం

ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని మెదక్​ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌ రావు అన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్బంగా భాజపా ఆధ్వర్యంలో కౌడిపల్లిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కౌడిపల్లిలో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌ రావు ప్రారంభించారు. సుమారు 70 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు.రక్తదానం ప్రాణాలను నిలబెడుతుందన్న వైద్యాధికారి... మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని అభినందించారు.

జిల్లాలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించడం వలన ఎంతో మందికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు రాజేందర్‌, చోళ రాంచరణ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: టీటా డిజిథాన్​కు యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.