ETV Bharat / state

నర్సాపూర్​లో వెల్లువిరిసిన సామాజిక చైతన్యం

author img

By

Published : Apr 1, 2020, 5:52 PM IST

పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలే ఎక్కువగా సామాజిక దూరం పాటిస్తున్నారు. రేషన్​ తీసుకోవడానికి వచ్చిన వారంతా మాస్కులు, చేతిరుమాలు కట్టుకుని నిత్యవసరాలు తీసుకెళ్లారు.

Biyyam Pampini in narsapur
నర్సాపూర్​లో వెల్లువిరిసిన సామాజిక చైతన్యం

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గంలో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నర్సాపూర్‌ పట్టణంతో పాటు గ్రామాల్లో కూడా రేషన్​ కోసం ప్రజలు క్యూకట్టారు. మాస్క్‌లు, చేతిరుమాళ్లు కట్టుకుని సామాజిక దూరం పాటించారు.

కొంతాన్‌పల్లి సర్పంచ్​ శ్రీనివాస్‌గౌడ్‌ గ్రామపంచాయతి సిబ్బందితో వీధులు, మురుగుకాలువలతో పాటు రోడ్లుపై రసాయనాలను పిచికారి చేయించారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా రోజు చాటింపు వేస్తున్నారు.

నర్సాపూర్​లో వెల్లువిరిసిన సామాజిక చైతన్యం

ఇవీ చూడండి: ప్రభాస్ కోసం ప్రత్యేక ఆస్పత్రి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.