ETV Bharat / state

ఆ హంతకులను కఠినంగా శిక్షించాలి: న్యాయవాదులు

author img

By

Published : Feb 18, 2021, 3:07 PM IST

Lawyers protest at manchiryala court against high court advacates murders in peddapalli district
హత్య చేసిన హంతకులను శిక్షించాలి: న్యాయవాదులు

హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ మంచిర్యాల కోర్టు సముదాయంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. లాయర్ల రక్షణకు బిల్లు తేవాలని డిమాండ్ చేస్తూ రహదారిపై రాస్తారోకో చేశారు.

మంచిర్యాల కోర్టు సముదాయంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ రహదారిపై రాస్తారోకో చేశారు.

హైకోర్టు న్యాయవాదులు వామన్ రావు, నాగమణిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. ఎంతటివారినైనా అరెస్టు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పోలీసులతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. లాయర్ల రక్షణకు బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.