SEED BALLS: విత్తన బంతులతో పాలమూరు యంత్రాంగం గిన్నిస్‌ రికార్డు

author img

By

Published : Jul 12, 2021, 6:15 PM IST

Updated : Jul 12, 2021, 11:19 PM IST

SEED BALLS: విత్తన బంతులతో పాలమూరు యంత్రాంగం గిన్నిస్‌ రికార్డు

18:11 July 12

విత్తన బంతులతో గిన్నిస్‌ రికార్డు సాధించిన మహబూబ్‌నగర్‌ జిల్లా యంత్రాంగం

విత్తన బంతులతో పాలమూరు యంత్రాంగం గిన్నిస్‌ రికార్డు

స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన విత్తన బంతులతో మహబూబ్​నగర్ జిల్లా యంత్రాంగం ప్రపంచ రికార్డు సృష్టించింది. విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించడం ద్వారా గిన్నిస్ బుక్​లో చోటు దక్కించుకుంది. మహబూబ్​నగర్ రైల్వే కమ్యూనిటీ హాల్ వేదికగా ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. 'టూ క్రోర్ సీడ్ బాల్స్ మేడ్ అండ్ ప్లాంటెడ్ బై ఎస్​హెచ్​జీ ట్రాన్స్​ఫామ్ మహబూబ్​నగర్ ఇన్​టూ హెటెరో గ్రీన్ బెల్ట్' అనే వాక్యాన్ని మహిళలు విత్తన బంతులతో వరుసగా పేర్చారు. 81 అక్షరాలను 81 మంది మహిళలు ఉదయం పదిన్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకూ పేర్చారు. అనంతరం ఎన్ని విత్తన బంతులతో ఆ వాక్యాన్ని రూపొందించారో లెక్కించారు. ఈ ప్రక్రియను గిన్నిస్ బుక్ ప్రతినిధులు రిశినాథ్, భారత ప్రతినిధి నిఖిల్ శుక్లా, లండన్ నుంచి ఆండ్రూఫ్ ఆన్​లైన్​లో పర్యవేక్షించారు.

ఆన్​లైన్ ఆధారాలు, ఫొటో సాక్ష్యాలు, ఇతర నివేదికలు పరిశీలించిన అనంతరం.. 73 వేల 918 విత్తన బంతులతో అతిపెద్ద వాక్యానికి రూపకల్పన చేసి ప్రపంచ రికార్డు సృష్టించినట్లు రిశినాథ్ వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహబూబ్​నగర్ కలెక్టర్ వెంకట్రావు, పాలమూరు జిల్లా మహిళా సమాఖ్య, డీఆర్డీఏ, మెప్మా, హెటెరో గ్రూపులు ఈ రికార్డును నెలకొల్పినట్లుగా వెల్లడించారు. విత్తన బంతులు పేర్చే ప్రక్రియను కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించగా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు సంతోశ్​కుమార్​లు సందర్శించారు. గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించిన మహిళల చొరవను అభినందించారు.  

గతేడాది కోటి విత్తన బంతులు తయారు చేసిన పాలమూరు స్వయం సహాయక బృందాల మహిళలు.. ఈసారి 2 కోట్ల 8 లక్షల 24 వేల విత్తన బంతులు తయారు చేసి సత్తా చాటారు. డీఆర్డీఏ, మెప్మా కలుపుకుని 10,432 సంఘాలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. డీఆర్డీఏ కోటీ 78 లక్షలు, మెప్మా ద్వారా 30 లక్షల విత్తన బంతులను కేవలం 10 రోజుల్లో పూర్తి చేశారు. అందుకోసం మహిళలంతా స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా గిన్నిస్​ బుక్​లో చోటు దక్కడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు సాధించేందుకు స్ఫూర్తినిచ్చిందన్నారు. 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​కు అంకితం..  

ఈ విజయాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్​కు అంకితమిస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు వెల్లడించారు. 'టూ క్రోర్ సీడ్ బాల్స్ మేడ్ అండ్ ప్లాంటెడ్ బై ఎస్​హెచ్​జీ ఉమెన్ ట్రాన్స్​ఫామ్ మహబూబ్​నగర్ ఇన్​టూ హెటెరో గ్రీన్ బెల్ట్​' అనే వాక్యాన్ని మహిళలు విత్తన బంతులతో రూపొందించారు.

ఇదీ చూడండి: post covid problems: దేశంలోనే తొలిసారిగా పోస్ట్ కొవిడ్ ఆస్పత్రి

Last Updated :Jul 12, 2021, 11:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.