ETV Bharat / state

తమ భూమిని అక్రమంగా రాయించుకున్నారంటూ.. కలెక్టరేట్ ముందు నిరసన

author img

By

Published : Dec 19, 2022, 9:23 PM IST

Family Protest In Front Of Collectorate Office: కొందరు వ్యక్తులు తమ భూమిలో సేద్యం చేసుకోనివ్వడం లేదంటూ ఓ కుటుంబం కలెక్టరేట్​ ముందు నిరసన చేపట్టిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లాలో చోటుచేసుకుంది. 2ఎకరాల 17గుంటల భూమిని ఇతరులు వారి పేరు మీద అక్రమంగా రాయించుకున్నారని జడ్చర్ల మండలం శిఖర్​గానిపల్లికి చెందిన స్వామి, తన తల్లి వెంకటమ్మ మహబూబ్​నగర్​ కలెక్టరేట్​లో ఫిర్యాదు చేశారు.

Family Protest In Front Of Collectorate Office
కలెక్టర్ కార్యలయం ముందు రైతు కుటుంబం నిరసన

Family Protest In Front Of Collectorate Office: 2016వ సంవత్సరంలో 2ఎకరాల 17గుంటల భూమిని కృష్ణయ్య అనే వ్యక్తి నుంచి తాము కొనుగోలు చేశామని బాధితుడు స్వామి తెలిపారు. కానీ 2017లో తమకు తెలియకుండా ఆ భూమిని మరో వ్యక్తి తన పేరు మీద రిజిస్ట్రేషన్​ చేసుకున్నాడని కలెక్టర్​కు విన్నవించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేసుకున్న తమ భూమిని వదిలిపెట్టాలని అడిగితే కొందరు వ్యక్తులు తమపై దాడికి దిగుతున్నారని వాపోయారు.

తమ అధీనంలో ఉన్న 7ఎకరాలలో కూడా సేద్యం చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై తరచు దాడులకు పాల్పడుతూ.. వేధిస్తున్నారని వాపోయారు. పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా.. స్పందించకపోవడంతో చివరి ప్రయత్నంగా కలెక్టర్​ను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నామని తెలిపారు.

"నా పేరు స్వామి మాది శిఖర్​గానిపల్లి. కొందరు వ్యక్తులు మా పొలంలోకి విత్తనాలు, ట్రాక్టర్లు రానివ్వడం లేదు. చంపుతామని బెదిరిస్తున్నారు. ఒక సారి కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాల మీద కర్రలతో తరుముతూ వెంటపడ్డారు. పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. చివరి ప్రయత్నంగా కలెక్టర్​ ఆఫీస్​కు వచ్చాము. కలెక్టర్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు."- స్వామి, బాధితుడు

తమ భూమిని అక్రమంగా రాయించుకున్నారంటూ.. కలెక్టరేట్ ముందు నిరసన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.