ETV Bharat / state

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణుల ధర్నా

author img

By

Published : Oct 21, 2020, 3:38 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఎల్లూరు లిఫ్ట్​లో పంప్​హౌజ్ నీట మునిగిన వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. ఎల్లూరు పంప్​హౌజ్​ ప్రమాదం పట్ల తెరాస ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్​ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లా బంద్​కు పిలుపునిచ్చింది.

congress bundh at mahabubabad district
ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణుల ధర్నా

ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్​ శ్రేణులు నిరసనకు దిగారు. మహబూబ్​నగర్​ పట్టణంలో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్​ ఆధ్వర్యంలో జిల్లాలోని దుకాణాలను పార్టీ శ్రేణులు మూసివేయించారు. బస్టాండ్​ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కమిషన్లకు కక్కుర్తి పడి కేఎల్ఐ పంప్​హౌజ్​కు దగ్గర్లోనే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగ మార్గాన్ని నిర్మించారని, అక్కడి పేలుళ్ల వల్లే పంప్​హజ్​ నీటమునిగిందని కొత్వాల్​ ఆరోపించారు.

పంప్​హౌజ్​ను పరిశీలిస్తామని ఎంపీలు, ప్రతిపక్ష నేతలు వస్తే అడ్డుకోవడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. ఎల్లూరు పంప్​హౌజ్​లో ప్రమాదం ఎలా జరిగిందో సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్​ చేశారు. పోలీసులు అందోళనకు దిగిన వారిని ఎక్కడికక్కడ అరెస్ట్​ చేసి సమీప పోలీస్​స్టేషన్లకు తరలించారు.

ఇదీ చదవండి: రామాంతపూర్​లో వర్షం నష్టాన్ని పరిశీలించిన కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.