ETV Bharat / state

'లక్ష్యానికి మించిన విత్తన బంతులను వెదజల్లాం..'

author img

By

Published : Jul 22, 2020, 10:29 AM IST

పుడమితల్లికి పచ్చదనాన్ని అందించేందుకు పాలమూరు జిల్లాలో కోటి విత్తన బంతులను వెదజల్లామని మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్రావు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటం వల్ల లక్ష్యాన్ని మించిన విత్తన బంతులను చల్లినట్టు పేర్కొన్నారు.

collecrot planted seeds balls in mahabubnagar
'లక్ష్యానికి మించిన విత్తన బంతులను వెదజల్లాం..'

మహబూబ్​నగర్​ జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా కోటి విత్తన బంతులను తయారు చేసి వెదజల్లేందుకు నిర్ణయించింది జిల్లా యంత్రాంగం. అనుకున్నదే తడువుగా.. పాలమూరు జిల్లా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కోటి విత్తన బంతుల తయారీ పూర్తి చేసి.. వాటిన వెదజల్లడం ప్రారంభించింది.

మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని రెండు రోజులు పొడగించారు. దీంతో లక్ష్యానికి మించి విత్తన బంతులను వెదజల్లినట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.

జిల్లాలోని 15 మండలాల్లో కోటి 14 లక్షల 88 వేల 61 బంతులను తయారు చేయగా, మంగళవారం నాటికి తయారు చేసిన మొత్తం విత్తన బంతులను ప్రభుత్వ భూములు, కొండలు, అడవులు, గుట్టలలో వెదజల్లినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. చివరి రోజు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్‌ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.