ETV Bharat / state

'తెలంగాణను అప్పులు పాలు చేసి కేసీఆర్​.. బీఆర్​ఎస్​తో కొత్త నాటకం'

author img

By

Published : Jan 5, 2023, 8:00 PM IST

bjp leader raj gopal reddy
బీజేపీ నేత రాజగోపాల్​రెడ్డి

Komatireddy Rajagopal Reddy criticizing BRS: మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లోని బూత్‌ అధ్యక్షులు, పైస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన సీఎం కేసీఆర్‌ టీఆర్​ఎస్​ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. అధికార పార్టీని గద్దె దించే లక్ష్యంగా ప్రతిఒక్క కార్యకర్త కదిలిరావాలని పిలుపునిచ్చారు.

Komatireddy Rajagopal Reddy criticizing BRS: కేసీఆర్​ సర్కారును గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు కిందిస్థాయి నుంచి పనిచేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలపునిచ్చారు. బీజేపీ మహబూబ్​నగర్​ నియోజక వర్గ పాలక్ హోదాలో ఆయన మహబూబ్​నగర్, హన్వాడ, మహబూబ్​నగర్ పట్టణంలోని బూతుస్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు.

అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తానో, అంతే ప్రాధాన్యం మహబూబ్​నగర్​కు ఇస్తానని చెప్పారు. మహబూబ్​నగర్​లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరాచక, అహంకార పూరిత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని రాజగోపాల్​ రెడ్డి హితవు పలికారు. మంత్రి అవినీతి, దోపిడి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు. కేసులకు భయపడవద్దని సూచించారు. తెలంగాణను అప్పుల పాలు చేసిన కేసీఆర్​ బీఆర్​ఎస్​ పేరుతో కొత్త నాటకాన్ని మొదలు పెట్టారని విమర్శించారు. కేసీఆర్​ ఎన్ని నాటకాలాడినా తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

"ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని భావించి కేసీఆర్​.. బీఆర్​ఎస్​ పార్టీ పెట్టి కొత్త నాటకం ఆడుతున్నారు. తెలంగాణను అప్పులు పాలు చేసి, ప్రాజెక్టులు మీద దోచుకుని దివాలా తీయించి ఇప్పుడు బీఆర్​ఎస్​ అనే కొత్త నాటకం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ పాలన మాకు వద్దని ప్రజలు నిర్ణయించుకున్నారు. బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలంటే అది బీజేపీ వల్లనే సాధ్యం. తెలంగాణ ప్రజలు అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంతో పాటు, మహబూబ్​నగర్​ జిల్లాను కూడా సమన్వయం చేసుకుంటాను. ఇక్కడున్న మంత్రి అహంకార పూరితంగా, అరాచకంగా మహబూబ్​నగర్​ నియోజకవర్గంలో పరిపాలన సాగిస్తున్నారు. అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. ఈ కల్వకుంట్ల కుటుంబ నియంత్రణ పాలనకు చరమగీతం పాడాలి." - కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, బీజేపీ నేత

మహబూబ్​నగర్​ జిల్లాలో బీజేపీ నేత రాజగోపాల్​రెడ్డి మీడియా సమావేశం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.