ETV Bharat / state

కాగజ్‌నగర్‌లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

author img

By

Published : Dec 20, 2020, 3:23 PM IST

cricket-tournament-inaugurated-by-sirpur-mla-koneru-konappa-in-kagaznagar
కాగజ్‌నగర్‌లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

కాగజ్‌నగర్‌లో క్రికెట్‌ టోర్నమెంట్‌ను సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. పట్టణంలోని శిశు మందిర్ విద్యాలయం ప్రాంగణంలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. విజేతకు రూ.30,000, రన్నర్ అప్‌కు రూ.15,000 నగదు బహుమతిగా ఇవ్వనున్నారు.

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోల్ల ప్రశాంత్ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. పట్టణంలోని శిశు మందిర్ విద్యాలయ ప్రాంగణంలోని క్రీడా మైదానంలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప టాస్ వేసి ఆటను షురూ చేశారు. పోటీలో తలపడనున్న ఇరు జట్లకు అభినందనలు తెలిపారు.

యువత క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొంటూ.. లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పది రోజుల పాటు నిర్వహించనున్న ఈ టోర్నమెంట్‌లో 40 జట్లు పాల్గొంటుండగా.. విజేతకు రూ.30,000, రన్నర్ అప్‌కు రూ.15,000 నగదు బహుమతిగా ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కోనేరు వంశీ, పురపాలక ఉపాధ్యక్షుడు రాచకొండ గిరీశ్, పట్టణ ఎస్‌హెచ్‌వో మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: చిన్న మార్పులతోనే మేలైన ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.