కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం బురదగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురికి తీవ్ర గాయలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగజ్నగర్ నుంచి వెంపల్లి వైపు వెళుతున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఆటో డ్రైవర్ శ్రీకాంత్, గురు, సుమన్భాయికు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమన్భాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: "రేపటినుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు"