ETV Bharat / state

ఆటో, కారు ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు

author img

By

Published : Oct 10, 2019, 4:09 AM IST

కురమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా బురదగూడ వద్ద ఆటోను కారు ఢీ కొట్టి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఆటో, కారు ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్ మండలం బురదగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురికి తీవ్ర గాయలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగజ్​నగర్ నుంచి వెంపల్లి వైపు వెళుతున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది. ఆటో డ్రైవర్ శ్రీకాంత్, గురు, సుమన్​భాయికు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమన్భాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఆటో, కారు ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు

ఇవీ చూడండి: "రేపటినుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు"

Intro:filename

tg_adb_21_kzr_road_accident_av_ts10034


Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం బురదగూడ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయలవగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కాగజ్ నగర్ నుండి వెంపల్లి వైపు వెళుతున్న అప్పి ఆటోను ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారు వేగంగా ఢీకొట్టి చెలల్లోకి వెళ్ళింది. ఆటో డ్రైవర్ శ్రీకాంత్, మరో ఇద్దరు గురు, సుమన్ బాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పట్టణంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమన్ బాయి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా స్విఫ్ట్ కారు కాగజ్ నగర్ పట్టణానికిచెందినదిగా భావిస్తున్నారు. కారు ఎవరు నడిపారు, ఎంతమంది ఉన్నాయి అని విషయాలు తెలియ రాలేదు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.