ETV Bharat / state

PIL IN TS High court : 'స్కూల్​ను సర్పంచ్ ఆక్రమించుకున్నారు.. చర్యలు తీసుకోండి'

author img

By

Published : Dec 26, 2021, 8:31 AM IST

PIL IN TS High court, allegations on sarpanch
సర్పంచ్​పై భూమి ఆక్రమణ ఆరోపణలు

PIL IN TS High court : స్కూల్​ను సర్పంచ్ ఆక్రమించుకున్నారని.. చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ రైతు హైకోర్టును ఆశ్రయించారు. కుమురంభీం జిల్లా రాళ్లకన్నెపల్లికి చెందిన బల్వంతరావు ఫిర్యాదు చేశారు. కలెక్టర్​కు చెప్పినా.. చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

PIL IN TS High court : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండలం రాళ్లకన్నెపల్లి ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్‌ గుణ్వంతరావు ఆక్రమించుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు. కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పాఠశాల భవనాల ఆక్రమణలను తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ అదే గ్రామానికి చెందిన రైతు బల్వంతరావు పిల్ దాఖలు చేశారు.

Telangana High Court News : గ్రామంలో పాఠశాల భవనాలను సర్పంచ్‌ తన నివాసాలుగా మార్చుకున్నారని.. రాజకీయ నేతలు, అధికారుల అండ చూసుకుని తననెవరూ ఏమీ చేయలేరని బహిరంగంగా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలలుగా చెబుతున్నా.. ఎవరూ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కబ్జా అయిన భవనాలను ఖాళీ చేయించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Teachers Transfers 2021 : టీచర్ల కేటాయింపు వివాదాస్పదం.. సీనియారిటీ జాబితా తప్పులతడక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.