గంగా కావేరి ఎక్స్ప్రెస్లో ఓ మహిళ ప్రసవించింది. బిహార్కు చెందిన పింకీ తన భర్త గణేశ్ గుప్తాతో కలిసి ఏపీలోని కొండపల్లికి వస్తున్నారు. ఖమ్మం వద్దకు వచ్చేసరికి ఆమెకు పురిటి నెప్పులు వచ్చాయి. రైలులోని శౌచాలయం వద్దనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది తల్లీ బిడ్డను ఖమ్మం మాతా సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఇప్పటికే వారికి ముగ్గురు మగ పిల్లలు ఉండగా నాలుగో సంతానంగా రైలులో ఆడబిడ్డ జన్మించింది. గత మూడురోజులుగా రైలులోనే ప్రయాణం సాగిస్తున్నారు. గంగా కావేరి రైలులో జన్మించిన పాపకు "గంగా కావేరి" అనే పేరు పెడతామని సంతోషంగా చెబుతోంది ఆ తల్లి.