ETV Bharat / state

'రాష్ట్రంలో జాతీయ రహదారులు విస్తరించండి'

author img

By

Published : Apr 29, 2020, 1:13 PM IST

nitin gadkari hold video conference with all state ministers
'రాష్ట్రంలో జాతీయ రహదారులు విస్తరించండి'

రాష్ట్రంలో జాతీయ రహదారులను విస్తరించాలని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీకి.. మంత్రులు వేముల ప్రశాంత్​రెడ్డి, పువ్వాడ అజయ్​కుమార్​ విజ్ఞప్తి చేశారు. కేంద్ర రవాణా శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​కు రాష్ట్రం తరఫున హాజరైన మంత్రులు.. పలు అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకువచ్చారు.

నూతన జాతీయ రహదారుల డిక్లరేషన్​ను త్వరగా పూర్తిచేయాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర మంత్రులు ప్రశాంత్ రెడ్డి, అజయ్​కుమార్​ లు విజ్ఞప్తి చేశారు. కేంద్ర రవాణా శాఖ.. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​కు రాష్ట్రం తరఫున హైదరాబాద్​ నుంచి మంత్రులు ప్రశాంత్​రెడ్డి, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్​కుమార్​ పాల్గొన్నారు.

తెలంగాణలో జాతీయ రహదారులను విస్తరించాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల పనుల గురించి కేంద్రమంత్రికి వివరించారు. లాక్​డౌన్ వల్ల కొన్ని చోట్ల పనులు నిలిచిపోయినట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు నూతన రోడ్లు, పెండింగ్ పనుల పురోగతిపై నితిన్ గడ్కరీతో మాట్లాడిన విషయాలను.. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.

రీజనల్ రింగ్ రోడ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎన్​హెచ్​ఏ అధికారులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: ఆ విషయం గురించి కేటీఆర్​తో మాట్లాడా: కిషన్​రెడ్డి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.